About this blog

I feel this blog as a reflection of my thoughts to myself , and sometimes as a public diary, and the is my only friend to share my thoughts who says never a "oh no! ,you shouldn't....That is boring...."

యుద్దంలో మరణించినప్పుడు కూడా ఏ సైనికుడుకీ ఇంత జనప్రభంజనం రాలేదేందుకు ? మిగతా 9 మందికి సంబంధిన వార్తా ఎక్కాడా కనిపించలేదు !

ఒకేసారి ప్రాణం విడవకుండా వారం రోజుల పాటు 35 అడుగుల అంచున -47 డిగ్రీల చలి లో బ్రతకాలనే పోరాట పటిమ చూపించినండుకా ఇంతమంది జనహారతి ! నాకు ఈ జనం అర్థం కారు , దేనికి బాగా స్పందిస్తారో దేనికి చీమకుట్టినట్టు కూడా చలించరో ! కానీ నాకు హనుమంతప్ప మరియు తనతోపాటు ప్రాణాలొదిలిన మిగతా 9 మందికి సంబంధిన వార్తా ఎక్కాడా కనిపించలేదు ! 


ఈనాడు వార్తా కథనం ఇలా వుంది 

వీరసేనానికి కన్నీటి వీడ్కోలు 
అధికార లాంఛనాలతో హనుమంతప్ప అంత్యక్రియలు 
వేలాదిగా తరలివచ్చిన ప్రజానీకం 
హుబ్బళ్లి - న్యూస్‌టుడే 
మర్‌ రహే.. అమర్‌ రహే.. హనుమంతప్పా! ఓ వీరుడా మళ్లీ జన్మించాలి.. అన్న నినాదాలతో కర్ణాటకలోని బెటదూరు గ్రామం మార్మోగింది. అన్ని రహదారులూ అటువైపే అన్నట్లుగా ఇసుకవేస్తే రాలనంతగా ప్రజలు తరలివచ్చారు. అభిమానుల కన్నీటి నడుమ అన్ని ప్రభుత్వ లాంఛనాలతో శుక్రవారం లాన్స్‌నాయక్‌ హనుమంతప్ప కొప్పద్‌ అంత్యక్రియల్ని నిర్వహించారు. నీలగుంద మఠాధిపతి చెన్నబసవస్వామి ఆధ్వర్యంలో వీరశైవ పద్ధతిలో అంత్యక్రియలు జరిగాయి. మరాఠీ రెజిమెంట్‌కు చెందిన రెండు వందల మంది సైనికులు హాజరయి సైనిక లాంఛనాలతో నివాళులు అర్పించారు. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, కేంద్రమంత్రి అనంతకుమార్‌, ఇతర మంత్రులు పాల్గొన్నారు.

దిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో గురువారం రాత్రి 10.30 గంటల సమయంలో హనుమంతప్ప కొప్పద్‌ భౌతిక కాయాన్ని హుబ్బళ్లికి తీసుకొచ్చారు. విమానాశ్రయంలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య భౌతిక కాయాన్ని స్వీకరించారు. రాత్రి కర్ణాటక వైద్య విజ్ఞాన సంస్థ (కిమ్స్‌) వైద్యాలయం శవాగారంలో ఉంచారు. శుక్రవారం ఉదయం ఏడు గంటలకు వైద్యాలయం నుంచి నెహ్రూ క్రీడాప్రాంగణం వరకు వూరేగింపుగా తీసుకొచ్చారు. అమర యోధుడిని చివరిసారిగా చూసేందుకు తండోపతండాలుగా జనం తరలివచ్చారు. నగరంలోని వివిధ విద్యా సంస్థలకు చెందిన విద్యార్థులు అధిక సంఖ్యలో స్టేడియం చేరుకున్నారు. ఒక దశలో వారిని అదుపుచేయడం పోలీసులకు కష్టమైంది. శ్రద్ధాంజలి ఘటించేందుకు వచ్చిన ప్రజలకు నగర హోటళ్ల యాజమాన్య సంఘం నీటిని అందించింది. అమరవీరుడికి నివాళిగా జలసేవ చేసినట్లు ప్రతినిధులు తెలిపారు. దాదాపు మూడు గంటల పాటు ప్రజల దర్శనానికి అవకాశం కల్పించిన అనంతరం అంబులెన్స్‌లో 27 కిలోమీటర్ల దూరంలోని స్వగ్రామం బెటదూరుకు తరలించారు. మార్గమధ్యంలో రహదారికి ఇరువైపులా ఆయా గ్రామాల ప్రజలు బారులుతీరి వీర జవాన్‌ను చివరి సారిగా సందర్శించారు.

బెటదూరు గ్రామానికి ఉదయం నుంచే ఇరుగుపొరుగు గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు చేరుకున్నారు. మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో అంత్యక్రియల్ని నిర్వహించారు. అంతకుముందు సైనికులు గౌరవ వందనం చేశారు. కొప్పద్‌ భార్య, తల్లిని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఓదార్చారు. ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. పరిహారంగా రూ. 25 లక్షలు, నాలుగెకరాల భూమి, ఇల్లు ఇస్తామని ప్రకటించారు. హుబ్బళ్లి నగరంలోని ప్రధాన రహదారికి అమర వీరుడి పేరు పెడతామని తెలిపారు. ఇదే సాయాన్ని సియాచిన్‌లో మరణించిన కర్ణాటకకు చెందిన మరో ఇద్దరు సైనికుల కుటుంబాలకు అందచేస్తామని చెప్పారు.

దేశ సేవకు వెనుకాడం 
కొడుకు మృతి చెందడం తీవ్ర శోకాన్ని మిగిల్చినా దేశ సేవకు వెనుకాడబోమని హనుమంతప్ప తల్లి, సోదరులు ప్రకటించారు. యువత దేశ రక్షణకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు.

కామెంట్‌లు లేవు: